అడివి శేష్ కథానాయకుడిగా రెజీనా కథానాయకగా వెంకట్ రాంజీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఎవరు'. ఈ చిత్రం ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ సినిమా అందరి అంచనాలను తారుమారు చేస్తూ అద్భుత విజయం సాధించింది.  అన్ని థేయెటర్స్ లలో మంచి కలక్షన్స్ ని రాబడుతుంది.   దర్శకుడు వెంకట్ రాంజీ కి ఇది  మొదటి సినిమా అయినా కూడా చాలా చక్కగా తెరకెక్కించాడు.  . 


సినిమాలో ఎక్కువ భాగాన్ని దాదాపు ఒకే రూమ్ లో  రెండు క్యారెక్టర్స్ తో షూట్ చేసిన కూడా ఎక్కడ కూడా బోర్ కోట్టలేదు. సినిమా స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశారు. అసలు అంత  తక్కువ బడ్జెట్ లో  ఇంత మంచి క్వాలిటి మూవీ తీసినా దర్శకుడి ప్రతిభను మెచ్చుకోవాలి.అడివి శేష్,రెజీనా లు చాలా బాగా నటించారు. ఈ సినిమా రెజీనా  కెరియర్ కి మంచి టర్న్ అవుతుంది. అడివి శేష్ స్వతహగా మంచి రచయిత కాబట్టి  ఇలాంటి స్టోరిని   సరిగా  జడ్జి చేసాడు
.
ఈ నేపథ్యంలో మధుర శ్రీధర్ ఈ విధంగా ట్విట్ చేశారు. అడివి శేష్ నాకు ఫిల్మ్ మేకింగ్ టిప్స్ చేప్పు. నేను నీ దగ్గర ట్యూషన్ కు వస్తాను అన్నారు. ఇందులో  అతిశాయోక్తి లేదు.అడివి శేష్ రాసినా చివరి ౨ సినిమాలు చూస్తే అర్థం అవుతుంది.ఆయన తక్కువ బడ్జెట్ తో న్యూఏజ్ మూవ్సీ తీస్తున్నారు. ఆయన  కథ మరియు స్క్రీన్ ప్లే అందించిన గూఢచారి సూపర్ సక్సెస్ అయ్యింది.


మధుర శ్రీధర్  స్నేహగీతంతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా కు ప్రశంసలు మాత్రమే వచ్చాయి,కమర్షల్ గా హిట్ కాలేదు. ఆ తరువాత  దర్శకత్వం వహించిన రెండు సినిమాలు కమర్షల్ గా హీట్ గా నిలిచాయి.ఆ తరువాత మధుర ఎంటర్టయిన్మెంట్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. ఆయన నిర్మించిన ఫ్యాషన్ డిజైనర్,  ఏబిసిడి, దోరసాని సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా పడ్డాయి..ఈ ట్విట్ చూస్తుంటే మధుర శ్రీధర్  ఒక్క హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాట్టు అనిపిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: