ప్రముఖ రచయిత మరియు నటుడైన అడివి శేష్ ప్రస్తుతం నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఎవరు. రేజీనా, నవీన్ చంద్ర, మురళి శర్మ, పవిత్ర్ర లోకేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు నూతన దర్శకుడు వెంకట్ రాంజీ దర్శకత్వం వహించగా, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించడం జరిగింది. ప్రముఖ నిర్మాత పొట్లూరి ప్రసాద్ తన పివిపి బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా, రిలీజ్ అయిన తొలిరోజు తొలిఆట నుండే ప్రేక్షకుల నుండి సూపర్ హిట్ టాక్ ని సంపాదించింది. ఆకట్టుకునే కథ, కథనాలు, అద్భుతమైన స్క్రీన్ ప్లే తో పాటు ప్రేక్షకుడికి థ్రిల్ కలిగించే ట్విస్టులు, 

మరియు అదిరిపోయేలా నటించిన ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ లతో ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. క్లాస్ మాస్ అని తేడా లేకుండా ఈ సినిమాకు అందరి నుండి అద్భుతమైన టాక్ రావడంతో యూనిట్ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేసారు. అయితే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయి దాదాపుగా ఇరవై రోజులు అవుతున్నప్పటికీ, ఈ సినిమాకు షాకింగ్ రేంజ్ లో కలెక్షన్ వస్తుండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిజానికి తొలి వారం తరువాత ఈ సినిమాకు కొన్ని థియేటర్లు పెంచడం జరిగింది. అయితే ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో దెబ్బకు ఎవరు కు కొంత థియేటర్లు తగ్గించాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా సాహోకు నెగటివ్ టాక్ రావడంతో, ఆ ప్రభావం ఎవరు పై పడి కలెక్షన్ మరింతగా పెరిగినట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 

ఇప్పటికే నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలు అందిస్తున్న ఈ సినిమా, మొత్తం క్లోజింగ్ సమయానికి రెండు వందల శాతానికి పైగా కలెక్షన్ రాబట్టే అవకాశం కనపడుతోందని వారు అంటున్నారు. ఇక ఇప్పటికీ కూడా మల్టిప్లెక్స్ ల్లో ఈ సినిమా వీక్ ఎండ్స్ సమయాల్లో మెజారిటీ ఆక్యుపెన్సీని కలిగి ఉంటోందని, ఇక దీనిని బట్టి ఈ ఏడాది రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించిన సినిమాల లిస్టులో ఈ ఎవరు సినిమా, మొదటి నాలుగు స్థానాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అంటున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: