సినీ ఇంస్ట్రీలో మామూలుగా  సినిమా విడుదల అవుతుంది అనుకున్నప్పుడు సినిమాను సినీ ప్రముఖులు చూడటానికి ప్రివ్యూలు వేస్తుంటారు.  సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు ప్రీమియర్స్ కూడా ఉంటాయి. కానీ దిల్ రాజు మాత్రం తన సినిమాను ఏకంగా 5 రోజుల ముందు నుంచే చూపిస్తున్నాడు. అది కూడా తెలుగు రాష్ట్రాల్లోని కాలేజీ స్టూడెంట్స్ కు చూపిస్తున్నాడనే వార్తలు వినపడుతున్నాయి..

 

యువ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా ఇద్దరి లోకం ఒకటే. క్రిస్మస్ కానుకగా బుధవారం ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాను హైదరాబాద్ లోని ఓ కాలేజీ విద్యార్థులకు చూపించారు. కేవలం సినిమాపై ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకే ఈ పని చేశామని దిల్ రాజు అనడం గమనార్హం. యూత్ ఫుల్ లవ్ స్టోరీ కాబట్టి యూత్ కు చూపించామని ఆచిత్ర యూనిట్ అంటున్నారు..

 

అక్కడితో మొదలు పెట్టిన దిల్ రాజు ఇప్పుడు నెల్లూరు లో కూడా మొదలు పెట్టాడు.. నెల్లూరులోని ఓ ప్రముఖ కాలేజీలో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు.. ఈ సినిమా బాగుందని ఫీడ్ బ్యాక్ ను తీసుకున్నాడు.. అలా స్టూడెంట్స్ పై మొదట తన సినిమాను ప్రయోగించాడు ..అలా ఎందుకు చేస్తున్నాడో ఇప్పటికీ అర్థం కాలేదని చెప్పాలి..

 

అసలు విషయానికొస్తే..ఇలా చేయడం వల్ల తమ సినిమా మౌత్ పబ్లిసిటీతో యూత్ కు బాగా దగ్గరవుతుందనేది దిల్ రాజు ఆలోచన. సినిమా నిజంగా బాగుంటే దిల్ రాజు ప్లాన్ వర్కవుట్ అవుతుంది. కంటెంట్ తేడా కొడితే మాత్రం మొదటి రోజేకే సినిమా ఖాళీ అయిపోతుంది. దీనికితోడు అత్యుత్సాహంతో విద్యార్థులు కంటెంట్ ను రికార్డ్ చేస్తే అదో తలనొప్పి. దిల్ రాజు అనుసరిస్తున్న ఈ కొత్త తరహా విధానం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఈ సినిమా ఎలా ఉండబోతుందో రెండు రోజుల్లో తెలియనుంది...

 

మరింత సమాచారం తెలుసుకోండి: