అడవి శేష్ నటించిన గూఢచారి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. "రా "ఏజెంట్ గా అడవి శేష్ అదరగొట్టాడు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అతి తక్కువ బడ్జెట్ లో కూడా సినిమాని బాగా తీయొచ్చని దర్శకుడు శశి కిరణ్ నిరూపించాడు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలని చూస్తే, ఇది మినిమమ్ బడ్జెట్ సినిమా అని ఎవరూ అనుకోరు. అంత తెలివిగా గూఢాచారి సినిమాని తెరకెక్కించారు.

 

శేష్ అందించిన కథతో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా శోభిత ధూళిపాల నటించింది. బాలీవుడ్ సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత మన తెలుగమ్మాయే. తెలుగమ్మాయే అయినా మొదటగా బాలివుడ్ లోనే అవకాశాలను అందుకుంది. అక్కడ వెబ్ సిరీస్ లలోనూ నటించింది. అయితే చాలా మంది హీరోయిన్లకి నటనతో పాటు అనేక అభిరుచులు ఉంటాయి. నటనని కొనసాగిస్తూనే అభిరుచులకి కూడా పదును పెడుతుంటారు.

 

కొంతమందికి పెయింటింగ్ హాబీ అయితే మరికొంత మందికి ఫోటోగ్రఫీ ఉంటుంది. అలాగే గూఢాచారి హీరోయిన్ శోభిత ధూళిపాల కి మంచి హాబీ ఉంది. తాజాగా ఆమె డిజైన్ చేసిన రగ్గుని జైపూర్ వెబ్ సైట్ లో వేలానికి పెట్టింది. ఆ వేలంలో వచ్చిన డబ్బుని లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీల సహాయానికి అందిస్తానని తెలిపింది.

 

అయితే ఆమె డిజైన్ చేసిన రగ్గుకి చాలా విశేషమే ఉంది. తెలుగమ్మాయి అయిన శోభితాకి ఇక్కడ సంస్కృతి అంటే చాలా ఇష్టమట. అందుకే మన తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా రగ్గుపై చుక్కల ముగ్గుని డిజైన్ గా వేసింది. అంతే కాదు ఆ డిజైన్ గురించి తెలియని వారికి దాని గురించి వివరణ ఇచ్చింది కూడా. తెలుగమ్మాయిలు తెలుగు సంస్కృతిని మరిచిపోతున్నారని బాధపడేవారికి ఇలాంటి సంఘటనలు  కొంత ఉపశమనాన్ని ఇస్తాయేమో కదా..!

మరింత సమాచారం తెలుసుకోండి: