బాలీవుడ్ సెక్స్ మోడల్ పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబే పై కేసు పెట్టిన సంగతి తెలిసిందే.పెళ్ళైన పది రోజులకే ఆమె ఇలా చేయడం పై బాలీవుడ్ లో పలు చర్చలకు దారితీసింది. ఎన్నో విమర్శలు కూడా పూనమ్ అందుకుంది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూ కు హాజరైన ఈ హాట్ బ్యూటీ తాను కేసు ఎందుకు పెట్టిందో వివరణ ఇచ్చింది. బెయిల్ పై విడుదల అయిన సామ్ తన ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకున్నాడని, ఇంక ఎప్పుడు తప్పు చేయనని హామీ ఇచ్చాడని తెలిపింది.



కాగా, అతడి పరిస్థితి చూస్తే జాలేస్తోందని, అందుకే కేసు వాపసు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పూనమ్ వెల్లడించింది. గత రెండేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న వాళ్ళు ,సెప్టెంబర్ 1 న వివాహం చేసుకొని ఒకటయ్యారు. పెళ్లయిన కొత్తలో ఇద్దరు కలిసి హనీమూన్ కు గోవా వెళ్లారు.అక్కడ పూనమ్ షూటింగ్ లకు కూడా హాజరైంది.అయితే వారిద్దరి మద్య మనస్పర్ధలు రావడంతో భర్త పై పూనమ్ గోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరుసటి రోజు బెయిల్‌పై బయటికి వచ్చాడు. ప్రతిసారి శామ్ బాంబే తనను కొట్టి మరోసారి ఇలా చేయనంటూ ఏడవడం మొదలు పెడతాడని పూనమ్ తెలిపింది. తన లైఫ్ కొంతకాలంగా ఇలాగే ఉంటోందని చెప్పుకొచ్చింది ఆ బ్యూటీ.



భార్య భర్తల బంధం అంటే ఇలాంటి గొడవలు కామన్..తిరిగి భర్తతో కలిసిపోయి వివాహా జీవితాన్ని మళ్లీ ప్రారంభించాలని పూనమ్ అనుకుంటున్నట్లు తెలిపింది.తమ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నామని, మళ్లీ కలిసి జీవించబోతున్నాం’ అంటూ ఓ ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. మేమిద్దరం ట్రూ లవర్స్ , మమ్మల్ని ఇలాంటి చిన్న గొడవలు విడగొట్టలేవు. వివాహా జీవితంలోని హెచ్చు తగ్గులు మా సంతోషాన్ని ఆపలేవు అంటూ పేర్కొంది. దీనిపై స్పందించిన నెటిజన్లు మళ్లీ మొగుడు పిచ్చి పట్టుకుందా అంటూ ఓ రేంజులో కామెంట్లను పెడుతూ వస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: