బుల్లితెరపై కామెడీ షోల పోటీ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక డ్యాన్స్ షోలలో అయినా సింగింగ్ షోలలో అయినా కామెడీ ఆర్టిస్టులు పెట్టి ఎపిసోడ్ విజయవంతంగా నడిపించడం మొదలు పెట్టారు. ఇక జబర్దస్ నుండి కొంతమంది స్టార్ కమెడియన్ లను జీ తెలుగు వారు ‘అదిరింది’ కి పిలుచుకున్నారు. అంతకన్నా ఎక్కువ పేమెంట్ ఇస్తామని వారు ఆ కమెడియన్స్ కు చెప్పినట్లు సమాచారం.

ఇక అదిరింది షో తొలి ఘట్టం చాలా కష్టం గా సాగింది. అయితే అందులో తాజాగా కొన్ని మార్పులు చేసి బొమ్మ అదిరిందిగా మార్చారు. యాంకర్లను మార్చారు… కొత్త జడ్జిలను తీసుకొని వచ్చారు కొత్త కాన్సెప్ట్ తో బరిలోకి దిగారు. ఇదంతా కొద్దికొద్దిగా వర్కవుట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ షో లో జరిగిన మార్పులు చేర్పుల ఎఫెక్టులు ఇప్పటికీ అలానే ఉన్నాయి. యాంకర్లుగా ఉన్న రవి, భాను శ్రీ లను తీసేశారు. ఈ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న నవదీప్ ను పక్కన పెట్టారు.

ఇక యాంకర్ భాను శ్రీ ప్లేసులో శ్రీముఖి ని తీసుకొని జడ్జి గా జానీ మాస్టర్ తీసుకువచ్చారు. దీంతో షో కొత్తవాళ్లతో బాగా సాగుతోంది. ఇక మొన్ననే మళ్ళీ ఈ షోలో కనువిందు చేసిన భాను శ్రీ తన అసంతృప్తిని బాహాటంగానే చెప్పేసింది. శ్రీముఖి పై తెలివిగా కౌంటర్లు వేస్తూ తనకు మళ్లీ రావాలని ఉన్నట్లు వ్యక్తం చేసింది. భాను ఇలా వ్యంగ్యార్థాలు తీయడంతో శ్రీముఖి కూడా కొద్దిగా నొచ్చుకున్నట్లు కనిపించింది. మరి భానుశ్రీ షో లోకి ఎంట్రీ ఇస్తే శ్రీముఖికి ఇబ్బంది ఉండదా అని నిర్వాహకులు ముందు ఆలోచించలేదా అని కామెంట్లు వస్తున్నాయి ఇంతకీ శ్రీముఖి సీటు సేఫ్ అంటారా…?

మరింత సమాచారం తెలుసుకోండి: