ప్రపంచంలో ఎవరికీ పరిచయం అక్కర్లేని పేరు జేమ్స్ బాండ్. ఈ స్పై థ్రిల్లర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అందులోనూ డానియల్ క్రెగ్ అంటే ప్రపంచం మొత్తం అతడికి అబిమానులు కోకొల్లలుగా ఉన్నారు. అంతే కాదు అతడి లేటెస్ట్ మూవీ, జేమ్స్ బాండ్ సిరీస్‌లో వస్తున్న ‘నో టైమ్ టు డై’ పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. దీనికి ఓ ముఖ్య కారణం.. జేమ్స్ బాండ్ పాత్రలో డానియల్ క్రెగ్ చేస్తున్న చివరి చిత్రం ఇదే. ఈ సినిమాను గతేడాది నవంబర్ 20వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ మహమ్మారి కరోనా కారణంగా ఈ సినిమా విడుదల చేయడం కుదరలేదు. ఆ తరువాత థియేటర్లు తెరుచుకున్నాయి.

అయినా వాటిపై ప్రేక్షకులు మాత్రం అంతగా ఫోకస్ చూపించలేదు. దీంతో జేమ్స్ బాండ్ సినిమా నిర్మాతలు ఈ చిత్రం విడుదలను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 8న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో ఈ జేమ్స్ బాండ్ సినిమా తెలుగు దర్శక ధీరుడు రాజమౌళి సినిమాకు అడ్డంకిగా మారుతుందా? అనే సందేహాలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఆందోళనలో ముంచేసింది. జక్కన్న కూడా తాను చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్‌ సినిమాను అక్టోబరు 8వ తేదీనే రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నాడట. ఈ సమయంలో జేమ్స్ బాండ్ సినిమా విడుదల ఉండటంతో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల మళ్లీ సందేహాల్లోకి వెళ్లింది. అయితే జేమ్స్ బాండ్ సిరీస్‌తో పోటీ పడటం మార్కెట్ పరంగా చాలా దెబ్బ తీసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో జక్కన్న ఏం చేస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ విడుదలను వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేస్తాడా అని కూడా అనుకుంటున్నారు. దీనిపనై జక్కన్న క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సింది.

మరింత సమాచారం తెలుసుకోండి: