స్టార్ హీరోస్ అన్నాక వారికి కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉండటం సాధారణ విషయమే. పొరపాటున వారు బయటకి వచ్చారంటే ఇక అభిమానుల హడావిడి మాములుగా ఉండదు. కొన్ని కొన్ని సార్లు అభిమానం ఎక్కువైతే సగటు హీరోకి కూడా చిరాకు వస్తుంది. అలాంటి ఘటన మళ్ళీ జరిగింది. ఇక తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు, సెలబ్రిటీలు మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కుని వినియోగించుకోడానికి సెలెబ్రెటీలు రావడం జరిగింది.కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో సూర్య, సూర్య తమ్ముడు కార్తీ, కమల్ హాసన్, శృతిహాసన్, అక్షరహాసన్, స్టార్ హీరో విజయ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


ఇక మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరోలలో ఎక్కువ ఫ్యాన్స్ వున్న హీరోలలో ఒకరైన అజిత్ తన భార్య షాలినితో కలిసి తిరువాయన్మూర్ లో ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే అజిత్ కారు దిగాడో లేదో తరువాత కొందరు అభిమానులు అజిత్ ను సెల్ఫీల కోసం చుట్టుముట్టారు. ఇష్టమైన హీరో కావడంతో అజిత్ తో ఫోటో దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.అభిమానుల ప్రవర్తనతో విసుగు చెందిన అజిత్ ఒక అభిమాని ఫోన్ ను జేబులో పెట్టుకున్నారు. ఆ తరువాత అభిమానులు వెళ్లిపోవాలంటూ అజిత్ వారిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎప్పుడూ కూల్ గా ఉండే అజిత్ అభిమానుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడ్డారని అర్థమవుతోంది. గతంలో కూడా అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించిన సమమయంలో అజిత్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే.ఈ విధంగా మితి మీరిన అభిమానం వల్ల స్టార్ హీరోస్ విసుగు చెందుతున్నారు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....


మరింత సమాచారం తెలుసుకోండి: