పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ఇవాళ కనీస అవసరాలకు ఇబ్బంది పడేవారికి రేపు అన్ని సౌకర్యాలు అందుతాయి. ఇప్పుడు అన్ని సౌకర్యాలు అందుకునే వాళ్లు కూడా తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఆ విధంగా ఒకప్పుడు సినిమా రంగంలో రాణించి సెలబ్రిటీలు గా ఎదిగి ఆ తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయారు చాలామంది.  సకల సౌకర్యాలు అందుకుని రిచ్ గా బ్రతికి ఇప్పుడు దయనీయ స్థితిలో ఉన్న నటీనటుల గురించి తెలుసుకుందాం.

అప్పట్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పర్వీన్ బాబి 2005లో ముంబైలో తన ఫ్లాట్ లో శవంగా కనిపించారు. చనిపోయిన రెండు రోజుల వరకు ఆమె మృతదేహాన్ని క్లైమ్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రఖ్యాత నటులు దర్శకులు అయినా భగవాన్ దాదా సినిమాలు ఫ్లాప్ అవడంతో వల్ల ఇల్లు, కారు అమ్మేసి ముంబైలోనీ ఛాల్ లో నివసించారు.  మోడల్ గీతాంజలి డ్రగ్స్ కి బానిసై సంపాదించినదంతా పోగొట్టుకుని సౌత్ ఢిల్లీ లో యాచిస్తు  కనిపించారు. అలాగే పనిమనిషి గా కూడా పనిచేశారు.

ప్రముఖ గాయకులు ఓ.పి.నయ్యర్ మద్యానికి బానిసై అయి కుటుంబానికి దూరమయ్యారు. తన దగ్గరికి ఇంటర్వ్యూ కోసం అడగడానికి వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం మద్యం ఇంకా డబ్బులు తీసుకునే వారు. చనిపోయే ముందు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు నయ్యర్.


భోజ్ పురి నటి మిథాలీ శర్మకి సినిమా అవకాశాలు తగ్గడంతో ముంబైలో యాచిస్తు కనిపించారు. అంతేకాకుండా దొంగతనం కూడా చేయడానికి ప్రయత్నించారు. సింగర్ అయిన సులక్షణ పండిట్ సంజీవ్ కుమార్ ని ప్రేమించారు. ఆయన తన ప్రేమను రిజెక్ట్ చేసిన తర్వాత ఆమె పెళ్లి చేసుకోలేదు. అవకాశాలు కూడా తగ్గడంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చివరికి గుడి మెట్లపై అడుక్కుంటూ కనిపించారు అనే వార్తలు కూడా వచ్చాయి.

హిందీ సీరియల్స్ లో నటించిన సావి సిద్ధూ 2019లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ముంబై లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నట్లు గుర్తించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: