అలా రామ్ చరణ్ తేజ్ అప్పటి వరకు మాస్ యాక్షన్ సినిమాలు చేసుకుంటూ రాగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన గోవిందుడు అందరివాడేలే సినిమా ఆయన కుటుంబ కథా చిత్రం చేయాలన్న కోరిక నెరవేరింది. 2014 అక్టోబర్ 1 న విడుదలైన ఈ సినిమాలో కాజల్ కథానాయిక గా నటించగా శ్రీకాంత్ , కమలిని ముఖర్జీ జంటగా నటించారు. భానుశ్రీ మెహ్రా, ప్రకాష్ రాజ్ , జయసుధ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. రామ్ చరణ్ కెరీర్లోనే మంచి చిత్రంగా నిలిచింది.
ఈ సినిమా విడుదల సమయంలో చాలాసార్లు దర్శకుడు కృష్ణ వంశీ ఈ సినిమా కథకు పాక్షికంగా అక్కినేని నాగేశ్వరరావు మీనా కలిసి నటించిన సీతారామయ్యగారి మనవరాలు స్ఫూర్తి అని చెప్పారు. ఆ సినిమాలో తాత కోసం మనవరాలు వస్తే ఈ సినిమాలో తాత కోసం మనవడు వచ్చి విడిపోయిన తన తండ్రిని వారితో కలుపుతాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా సంగీత పరంగా ప్రేక్షకులను కొంత నిరుత్సాహ పరిచింది అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కృష్ణవంశీ సినిమాలంటే సంగీత సాహిత్యాలకు నిర్ణయం గా ఉంటాయి అయితే ఈ సినిమా పాటలు ఆ స్థాయిలో లేవని విమర్శకులు అభిప్రాయపడ్డారు.