తెలుగు చిత్ర పరిశ్రమలో నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సమీరా రెడ్డి.ఒకప్పుడు తెలుగులో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది ఈ హీరోయిన్.'మైనే దిల్ తుజ్కో దియా' అనే హిందీ సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అయిన సమీరా రెడ్డి.. ఆ తర్వాత బాలీవుడ్ లో పలు గ్లామర్ రోల్స్ లో నటించి అక్కడా మంచి గుర్తింపు సంపాదించింది.అయితే బాలీవుడ్ లో అందరు హీరోయిన్లకు వచ్చిన నెపోటిజం సమస్యే ఈ హీరోయిన్ కూడా వచ్చింది.నెపోటిజం కారణంగా బాలీవుడ్ లో తనకు అవకాశాలు రాలేదు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పింది సమీరా.తనను చాలా సినిమాల్లో ముందు హీరోయిన్ గా తీసుకొని ఆ తర్వాత తీసేసారట.అందుకే బాలీవుడ్ ని వదిలి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.

దాదాపు 11 ఏళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు, అశోక్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది సమీరా.ఆ రెండు సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించలేకపోయాయి. ఇక ఆ తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవికి జోడిగా జై చిరంజీవ సినిమాలో నటించింది.దురదృష్టవశాత్తు ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ఇక అదే సమయంలో ఎన్టీఆర్ తో రెండు సినిమాల్లో నటించిన ఈమె..ఏకంగా అతనితో ప్రేమలో ఉందని.. మరికొన్ని రోజుల్లో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు అప్పట్లో వార్తలు తెగ ప్రచారమయ్యాయి.ఈ హీరోయిన్ కూడా తెలుగమ్మాయి కావడంతో అందరూ ఇదే నిజం అనుకున్నారు.కానీ అవన్నీ పుకార్లేనని..


 తాము మంచి స్నేహితులమని తేల్చి చెప్పేసారు ఈ ఇద్దరూ.అయితే తెలుగులో కూడా ఈమెకు సరైన విజయం దక్కకపోవడంతో మళ్ళీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది సమీరా రెడ్డి.అక్కడ కూడా అదే పరిస్థితి.ఇక మెల్ల మెల్లగా సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో అక్షయ్ వర్దే అనే బిజినెస్ మ్యాన్ ను 2014 వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది.అయితే సమీరా రెడ్డికి కన్యాదానం చేసిన వ్యక్తి కూడా మరెవరో కాదు మన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యానే.అంతేకాదు ఆయనే దగ్గరుండి మరీ సమీరా రెడ్డి వివాహాన్ని జరిపించాడట.విజయ్ మాల్యా, సమీరా రెడ్డి మంచి స్నేహితులట.ఇక సమీరా రెడ్డి పెళ్లి చేసుకునే సమయంలో ఆమె బంధువులు ఎవరూ రాకపోయేసరికి తన ఫ్రెండ్ అయిన విజయ్ మాల్యా..సమీరా రెడ్డికి కన్యాదానం చేసాడట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: