ప్రముఖ దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ ఈ మధ్యనే 'ఏక్ మినీ కథ' అనే వినూత్న కథతో వచ్చి మంచి ఫలితాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన డైరెక్టర్ మారుతీతో ఒక సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన రోజు అందరూ, అదేంటి చిన్న హీరోతో మారుతీ సినిమా చేస్తున్నాడనుకున్నారు. కానీ మారుతీ ఒక సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడంటే అతనిలో విషయం లేనిదే ముందుకెళ్ళడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కాసేపటి క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాకు 'మంచి రోజులు వచ్చాయి' అనే టైటిల్ ఖరారు చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో హీరోయిన్లుగా సంతోష్ శోభన్ మరియు మెహ్రీన్ లు నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ని బట్టి చూస్తే, ఈ సినిమాలో ప్రేమ కథను సరికొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రెండవ సినిమా హిట్ అయినప్పటికీ, ఇప్పుడు ఈ సినిమాపై అభిమానులకు అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి మారుతీ ఈ అంచనాలను అందుకుంటాడా ? సంతోష్ శోభన్ కు కూడా ఈ సినిమా కత్తి మీద సాము లాంటిది. ఒక హిట్ రావడం ఈజీ అయినా, దానిని ముందు ముందు కాపాడుకోవడం కొంచెం కష్టమనే చెప్పాలి. మరి సంతోష్ శోభన్ వరుస హిట్ కొడతాడా లేదా తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయక తప్పేలా లేదు.
కాగా సంతోష్ శోభన్ మరో రెండు సినిమాలను త్వరలోనే పట్టాలెక్కించనున్నాడు. వాటిలో 'ప్రేమ్ కుమార్', మరియు 'అన్నీ మంచి శకునములే' లాంటి సినిమాలు ఉన్నాయి. అంతే కాకుండా చిరంజీవి పెద్ద కూతురు నిర్మాతగా కూడా ఒక తమిళ మూవీని తెలుగులో రీమేక్ చేయనున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: