సినిమా ఇండస్ట్రీలో చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. తమ సినీజీవితంగా బాగుండాలంటే లక్ కే  ఎక్కువ ప్రియారీటీ ఇస్తారు. దానిపైనే జీవితం ఆధారపడి ఉంటుంది. హీరో, హీరోయిన్స్ విషయంలో ఈ విషయాన్ని గట్టిగా నమ్ముతారు. అదే తాము చేయబోయేది తొలి సినిమాకు ఆటంకాలు ఏర్పడితే.. చాలా డిసప్పాయింట్ కావాల్సి వస్తుంది. హీరోయిన్స్ ఇప్పుడు ఇదే ఫేస్ చేస్తున్నారు. కోలీవుడ్, మాలీవుడ్ చిత్రాలతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది ఐశ్వర్యాలక్ష్మి. ఈ ఇమేజ్ తో టాలీవుడ్ లోనూ స్టార్ డమ్ కోసం ఆరాటపడుతోంది. సత్యదేవ్‌ మూవీ 'గాడ్సే' చిత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

ఇక సయూ మంజ్రేకర్.. టాలీవుడ్ లో తన లక్ ఏంటో నిరూపించుకోవాలనుకుంటోంది. అడివి శేష్‌ 'మేజర్'లో నటిస్తోంది. ఈ సినిమా జులైలో విడుదల కావాల్సి ఉన్నా.. సెకండ్ వేవ్ తో అడ్డంకులు ఎదురయ్యాయి. అలాగే వరుణ్‌తేజ్‌తో కలిసి నటిస్తోన్న 'గని' సినిమా ఇంకా షూటింగ్‌ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది.

మరోవైపు తాన్యా రవింద్రన్ తమిళంలో మంచి ఇమేజ్ సంపాదించుకుంది. ఇక తెలుగులో కార్తికేయ 'రాజా విక్రమార్క' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా పూర్తయ్యే సమయానికి షూటింగ్ కు లాక్ డౌన్ లాక్ పడింది. మరోవైపు 'ఓ మై కడవులే' చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది ముంబయి బ్యూటీ మిథిలా పార్కర్‌. ఈ అమ్మడికి కూడా లాక్ డౌన్ దెబ్బపడింది.  

కేతిక శర్మ.. ఆకాశ్ పూరి 'రొమాంటిక్' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా కరోనా దెబ్బకు పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్ లో ఉండగానే నాగశౌర్య 'లక్ష్య'కి సంతకం పెట్టేసింది.  అయితే కరోనాతో ఈ చిత్రానికి అడ్డంకులు ఎదురయ్యాయి. చేతిలో మూడు సినిమాలున్నా, కేతిక విడుదల కోసం వెయిట్ చేస్తోంది. చూద్దాం.. వీళ్ల భవిష్యత్ ఎలా ముందుకు సాగుతుందో. అడ్డంకులు ఎప్పుడు సమసి పోయి సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: