ఈ సినిమా కథ మొత్తం కేవలం ఒక ట్రైన్ లోనే జరుగుతుంది. ఈ సినిమా ఆద్యంతం మొత్తం నవ్వులు-పువ్వులు పూయిస్తూ.. 100 తప్పులు చేస్తే ఇంటి నుంచి బయటకు వెళ్లాలి అనే తండ్రి ఆజ్ఞ.. సప్తగిరి, తాగుబోతు రమేశ్ కామెడీ అన్నీ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచాయి. పృధ్విరాజ్ డైలాగులు, అతని నటన, కామెడీ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాలో చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ కూడా బాగా నటించి, డైలాగులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.
2013వ సంవత్సరంలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ సింగ్ లు నటించారు. జెమినీ కిరణ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు , దర్శకుడు మేర్లపాక గాంధీ రచయితగా వ్యవహరించి, మంచి సంభాషణలను చేకూర్చాడు. 2013లో విడుదలైన ఈ చిత్రం ద్వారా స్క్రీన్ ప్లే రచయితగా మేర్లపాక గాంధీ నంది పురస్కారాన్ని అందుకోగా, ఉత్తమ హాస్యనటుడిగా తాగుబోతు రమేష్ నంది పురస్కారాలను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా రకుల్ ప్రీతిసింగ్ చెప్పే..ప్రార్థనా.. ప్రతీ రూపాయి కౌంటింగ్ ఇక్కడ అంటూ సాగే డైలాగ్స్ తో రకుల్ ప్రీతిసింగ్ కూడా మంచి విజయాన్ని అందుకుంది.