సాధారణంగా సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత హీరోలు అలాగే ఉండిపోతారు. గాని హీరోయిన్లు మాత్రం మారిపోతుంటారు. ఎప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూ ఉండటంతో ఇక అదృష్టం బాగుంటే చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే ఎదుగుతూ ఉండటం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లు కేవలం ఒకేఒక్క సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి హీరోయిన్లలో ముందుగా చెప్పుకోవాల్సింది శ్వేతా బసు ప్రసాద్ అనే చెప్పాలి.


అప్పటి వరకు ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. కానీమొదటి సినిమాతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా పక్కింటి అమ్మాయిలా అందరినీ ఆకర్షించింది. . ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. కొత్త బంగారు లోకం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన కొత్త బంగారులోకం సినిమాలో నటించింది శ్వేతా బసు ప్రసాద్.


ఈ సినిమాలో తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరించింది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమాలో శ్వేతా బసు ప్రసాద్ చెప్పే ప్రతి డైలాగు ఇక పాత్రకు ఉన్న  క్రేజ్ మొత్తం తెలుగు ప్రేక్షకులందరికీ కట్కనెక్ట్ అయిపోయింది. ఇది ఎన్నో రోజుల పాటు  శ్వేతాబసుప్రసాద్ లాగే అమ్మాయిలు అందరూ కూడా ప్రవర్తించడం మొదలుపెట్టారు అంటే ఈ అమ్మడు ఎంతలా అందరికీ కనెక్ట్ అయిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా ఒక్క సినిమాతోనే ఎంతగానో క్రేజ్ సంపాదించుకుంది శ్వేతా బసు ప్రసాద్. కానీ ఆ తర్వాత మాత్రం చిత్ర పరిశ్రమలో కనుమరుగైపోయింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ  అనుకున్నంత గుర్తింపు మాత్రం తీసుకురాలేదు. దీంతో తర్వాత అవకాశాలు కరువై తెలుగుతెరపై కనుమరుగయింది శ్వేతా బసు ప్రసాద్.

మరింత సమాచారం తెలుసుకోండి: