పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న పుష్ప సినిమా భారీ హైప్ క్రియేట్ చేసుకుంది. థియేటర్లకు మళ్లీ ఒకప్పటి మాస్ జాతర కళ తెచ్చేలా పుష్ప సినిమా సందడి చేస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3000 స్క్రీన్లలో రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో 1200 థియేటర్లకు పైగా పుష్ప రిలీజ్ అవుతుంది. కర్ణాటకలో 140 సెంటర్స్.. తమిళనాడులో 280.. కేరళలో 200 సెంటర్స్ లో పుష్ప రిలీజ్ అవుతుంది.

ఇదే కాకుండా హిందీ వర్షన్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా మరో 600 స్క్రీన్స్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. ఓవర్సీస్ లో 600+ స్క్రీన్స్ లో పుష్ప వస్తుంది. టోటల్ గా వరల్డ్ వైడ్ గా పుష్ప 3000 స్క్రీన్లకు మించి రిలీజ్ అవుతుంది. తప్పకుండా పుష్పతో అల్లు అర్జున్ హంగామా ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది. ఇప్పటికే ట్రైలర్ తోనే ఊర మాస్ అనిపించిన పుష్ప బాక్సాఫీస్ దగ్గర కూడా ఆ జోష్ కనబరుస్తారని ఫిక్స్ అవ్వొచ్చు.

ఇక రిలీజ్ అవుతున్న ఈ 3000 ప్లస్ సెంటర్స్ లో ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ అన్నిచోట్ల హౌజ్ ఫుల్ పెట్టేశారు. నైజాం లో రిలీజ్ కు ఒకరోజు ముందు ఐదు షోలు పర్మిషన్ ఇవ్వగా ఎక్స్ ట్రా షో టికెట్స్ కూడా నిమిషాల వ్యవధిలో ఫిల్ అయిపోయాయి. పుష్ప పై ఈ బజ్ చూస్తుంటే అల వైకుంఠపురములో సినిమాతో బన్నీ ఏర్పరచుకున్న రికార్డులు అన్ని చెరిపివేయడం పక్కా అనిపించేలా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప మూవీలో సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ పుష్ప పార్ట్ 1 ది రైజ్ లో సునీల్, అనసూయ కూడా నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: