టాలీవుడ్ సినిమా ఖ్యాతిని హాలీవుడ్ స్థాయికి చాటి చెప్పిన దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి. ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కించిన బాహుబలి రెండు సినిమాలు ఒకదానిని మించేలా మరొకటి ఎంతో పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఆర్కా మీడియా సంస్థ నిర్మించింది.

ఇక ఈ సినిమాల అనంతరం ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ నటులు ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి తీస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. జనవరి 7న ఎంతో భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ పై అటు ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ తో పాటు యావత్ ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్, టీజర్స్ సినిమాపై ఆ అంచనాలు మరింతగా పెంచడం జరిగింది.

అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమాని భారీ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, అలానే కొమురం భీం గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఇద్దరూ తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించారని సమాచారం. ఇక ముఖ్యంగా సినిమాలో ఇద్దరు హీరోల కీలక సీన్స్ తో పాటు ఇందులో పదహారు నిమిషాల పాటు సాగె అద్భుతంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ నిజంగా ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అని, భారీ యాక్షన్, ఫైట్ సీన్స్ తో తెరకెక్కిన ఆ ఎపిసోడ్ అనంతరం అందరికీ సెకండ్ హాఫ్ పై మరింతగా అంచనాలు పెరుగుతాయని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ కూడా అద్భుతంగా సాగడంతో పాటు ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా కథని ఎంతో రేసీ గా రాజమౌళి తెరకెక్కించారట. మొత్తంగా ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ ఎపిసోడ్ అద్భుతంగా ఉండనుంది అంటూ ప్రచారం అవుతున్న ఈ వార్త మూవీ పై ఉన్న హైప్ ని మరింతగా పెంచింది. మరికొద్దిరోజుల్లో ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: