

ఆ షో లో మహేష్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్న విజువల్స్, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక మరొకవైపు నేడు ఉదయం నుండి పలు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఒక వార్త ప్రకారం ఇటీవల మహేష్ దుబాయ్ వెళ్లబోయే ముందు ఆయనని తన నివాసంలో ప్రత్యేకంగా పూరి జగన్నాథ్ కలిసారని, అలానే తమ కాంబోలో తదుపరి చేయబోయే బిజినెస్ మేన్ 2 మూవీ స్టోరీ ని మహేష్ కి వినిపించిన పూరి, ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారని, త్వరలో స్క్రిప్ట్ పూర్తి చేసే పనులు ప్రారంభించనున్న పూరి, ఈ ఏడాది చివరిలో దీనిని పట్టాలెక్కించేలా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరి ఇదే కనుక నిజం అయితే మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు అనే చెప్పాలి.