ప్రస్తుతం మన దేశంలో కోవిడ్ మహమ్మారి మరొక్కసారి పంజా విసురుతోంది. ఇటీవల కొన్నాళ్ల క్రితం ఒక్కసారిగా సౌత్ ఆఫ్రికాలో కోవిడ్ సరికొత్త వేరియంట్ ఓమిక్రాన్ వెలుగుచూడడం, అనంతరం అది పలు ఇతర దేశాలకు కూడా పాకడంతో పాటు ఇండియాలో కూడా మెల్లగా ఒమిక్రాన్ కేసులు పెరుగుదల మొదలైంది. కొన్నాళ్లుగా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో ఎక్కడికక్కడ పలు రాష్ట్ర ప్రభుత్వాలు పక్కాగా ఆంక్షలు విధిస్తూ ప్రజలని మరింత అప్రమత్తం చేయడంతో పాటు ఇప్పటికీ టీకా తీసుకొని వారిని వీలైనంత త్వరగా వేయించుకోమని కోరుతున్నాయి. అలానే ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించి సోషల్ డిస్టన్సింగ్ పాటించాలని సూచిస్తున్నారు. ఇక ఈ మహమ్మారి ప్రస్తుతం పలువురు సినిమా పరిశ్రమ వారిని కూడా ఇబ్బందులు పెడుతోంది.

ముందుగా ముంబైలో కరీనా కపూర్ కి కరోనా పాజిటివ్ సోకగా, తెలుగులో మొన్న మహేష్ బాబు, నిన్న లక్ష్మి మంచు, నేడు సంగీత దర్శకుడు థమన్ ఇలా పలువురు సినీ ప్రముఖులు దీని బారిన పడ్డారు. అయితే విషయం ఏమిటంటే టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా అందరి నుండి మంచి పేరు దక్కించుకున్న రామలక్ష్మి క్రియేషన్స్ అధినేత లగపాటి శ్రీధర్ కి కూడా నిన్న కరోనా కరోనా పాజిటివ్ రావడంతో పాటు టెస్టులు చేయించుకున్న ఆయన భార్య శిరీష సహా కుటుంబం మొత్తానికి కూడా పాజిటివ్ అని తేలిందట. దానితో వారందరూ కూడా ప్రస్తుతం ప్రత్యేకంగా హోమ్ ఐసోలేషన్ లో ఉండడంతో పాటు పక్కాగా డాక్టర్ల నుండి చికిత్స తీసుకుంటూ ఎంతో జాగ్రత్త వహిస్తున్నట్లు సమాచారం.

తెలుగులో ఎవడి గోల వాడిది, స్టైల్, పోటుగాడు, స్నేహ గీతంతో పాటు ఇటీవల అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య వంటి సినిమాలు నిర్మించారు శ్రీధర్. ఇక శ్రీధర్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకడంతో అతి త్వరలో వారు కోలుకోవాలని కోరుతూ పలువురు సినిమా ప్రముఖులు వారికి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పీడీ రికవరీ అంటూ మెసేజస్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ మహమ్మారి రెండు డోసులు టీకా తీసుకున్నప్పటికీ కూడా సోకుతోందని, కొందరు డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ పెద్దగా ప్రమాదమైనది కాదని అంటున్నప్పటికీ, దీనిని ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దని డాక్టర్లు గట్టిగా హెచ్చరిక చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: