ఒకప్పుడు కేవలం తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రమే పాటలు పాడిన సిద్ శ్రీరామ్ తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా పాటల తో దూసుకుపోతున్నాడు. ఇక తన గాత్రంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయ్యాడు సిద్దు శ్రీరామ్. గత కొంత కాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా కూడా సిద్ శ్రీరామ్ పాడిన పాటలే వినిపిస్తున్నాయి. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకూ ఈ సెన్సేషనల్ సింగర్ తో ఒక్క పాట పాడిస్తే చాలు ఇక ఆ పాట సినిమాకు ఎంతో ప్లస్ అవుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అయితే మొన్నటి తన మధురమైన గాత్రంతో ప్రేక్షకుల మదికి దగ్గరైన సిద్ శ్రీరామ్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడట.
మొన్నటి వరకూ తన సింగింగ్ టాలెంటుతో ఎంతోమందినీ మంత్రముగ్ధులను చేసిన సిద్ శ్రీరామ్ ఇక ఇప్పుడు హీరోగా తన నటనతో కూడా మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడట. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి అనే సినిమాతో గాయకుడిగా చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యాడు సిద్ శ్రీరామ్. ఇక ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతోనే హీరోగా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తయిందని.. సిద్ శ్రీరామ్ కు స్క్రిప్టు నచ్చడంతో హీరోగా నటించేందుకు ఒప్పుకున్నాడు అంటూ టాక్ వినిపిస్తోంది.