ప్రస్తుతం బయటి పరిస్థితులు ఒకప్పటిలా లేవు. ఎక్కడకి వెళ్లాలన్నా ఏ పని చేయాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి చేయాల్సి వస్తోంది. దానికి కారణం ఈ మహమ్మారి కరోనా. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్తున్న వారైతే తప్పనిసరిగా మాస్క్ వేసుకుని, చేతులు శానిటైజ్ చేసుకుని, పక్కాగా ఇతర జాగ్రత్తలు తీసుకుని మరీ వెళ్ళవలసి వష్తోంది.

ఈ మహమ్మారి అంతగా మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. దీని కారణంగా రెండేళ్ల నుండి ఇప్పటికే లక్షలాదిమంది ప్రజలతో పాటు అనేకమంది సెలెబ్రిటీలు సైతం మృత్యువాత పడ్డారు. ఇక ఇటీవల సినిమా పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు సైతం దీని బారిన పడ్డారు. అయితే అసలు విషయం ఏమిటంటే, టాలీవుడ్ లో సీనియర్ నటిగా తన ఆకట్టుకునే అందం అభినయంతో సహజనటిగా మంచి పేరు అందుకున్న నటి జయసుధ. కాగా నేడు ఆమెకు కరోనా పాజిటివ్ సోకినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉన్నారని, అక్కడే ఆమెకు పాజిటివ్ వచ్చిందని, అందుకే ప్రస్తుతం ఆమె తన ఫ్యామిలీకి ఇబ్బంది కలుగకుండా హోమ్ ఐసోలేషన్లో ఒక రూమ్ లో ఉంటున్నారని సమాచారం. ఇక జయసుధకు కరోనా సోకిందని తెలియడంతో ఆమె అభిమానులతో పాటు పలువురు సినిమా ప్రముఖులు ఆమె త్వరలో కోలుకుని మళ్ళి మన ముందుకు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుతూ సోషల్ మీడియా మధ్యమాలలో మెసేజెస్ చేస్తున్నారు.

తొలిసారిగా పండంటి కాపురం సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జయసుధ, ఆ సినిమా భారీ సక్సె తో పాటు అందులో నటిగా మంచి పేరు అందుకున్నారు. ఆ తరువాత ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన జయసుధ అనతికాలంలోనే సహజనటిగా బాగా పేరు సంపాదించారు. తన కెరీర్ లో ఎందరో స్టార్స్ తో పని చేసి గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించారు జయసుధ. మరి ఆమె త్వరగా కోలుకుని మళ్ళి మనముందుకు రావాలని అందరం కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: