ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి తనయుడు సినీ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అంటూ ఎప్పటినుండో వార్తలు వస్తున్న తరుణంలో ఆ విషయం పై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త కర్ణాటక రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించి అప్పట్లో మంత్రిగా కూడా పని చేసిన గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటి ఇపుడు తెలుగు తెరపై హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ కర్ణాటక వాసి టాలీవుడ్ లో తన సినీ కెరియర్ ను ప్రారంభించేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పటికే ఈ మూవీ ప్రారంభోత్సవం కూడా జరిగి పోయింది. ఇటీవలే టాలీవుడ్ సినీ కళా శిల్పి జక్కన్న ఈ సినిమాకి క్లాప్ కొట్టి చిత్రాన్ని ముందుకు షురూ చేశారు.

ఇక ఈ సినిమాలో "పెళ్లి సందD" మూవీ ఫేం శ్రీ లీల హీరోయిన్ గా చేస్తోంది. ఒక్క సినిమాతోనే ఈ అమ్మడు క్రేజ్ మాములుగా లేదు. ఈ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా, రెండు మూడు పెద్ద సినిమాలు కూడా చేస్తున్నట్లు వార్తాహలు వినిపిస్తున్నాయి.  ఒకప్పుడు హాసినిగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన బాలీవుడ్ నటి జెనీలియా పెళ్లి తర్వాత ఏ సినిమాలోనూ నటించింది లేదు. ఇప్పుడు కిరీటి సినిమాలో ఒక ప్రధాన పాత్రా చేయడానికి ఒప్పుకున్నారు. కాగా తాజాగా ఈ సినిమా గురించి మరో న్యూస్ తెలుగు ప్రేక్షకులను తనవైపు బాగా  ఆకర్షిస్తోంది.

ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు పాన్ ఇండియా హీరో ప్రభాస్ ని అడిగినట్లు ఆయన సరే అన్నట్లు సమాచారం. చిన్న సినిమాలు అయినా తన దాకా రిక్వెస్ట్ వస్తే కాదనకుండా సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ముందుంటారు ఈ బ్యాచిలర్ స్టార్ హీరో . ఈ మధ్య జాతిరత్నాలు మూవీని కూడా ప్రమోట్ చేసి ఓ రేంజ్ లో సక్సెస్ అందుకున్న ఈ మూవీ సక్సెస్ లో భాగమయ్యారు డార్లింగ్. అయితే ఇపుడు గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా చేస్తున్న మూవీని సైతం ప్రమోట్ చేసేందుకు రెబల్ స్టార్ అంగీకరించారని వార్తలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: