ఇక ఈ సినిమాలో "పెళ్లి సందD" మూవీ ఫేం శ్రీ లీల హీరోయిన్ గా చేస్తోంది. ఒక్క సినిమాతోనే ఈ అమ్మడు క్రేజ్ మాములుగా లేదు. ఈ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా, రెండు మూడు పెద్ద సినిమాలు కూడా చేస్తున్నట్లు వార్తాహలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు హాసినిగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన బాలీవుడ్ నటి జెనీలియా పెళ్లి తర్వాత ఏ సినిమాలోనూ నటించింది లేదు. ఇప్పుడు కిరీటి సినిమాలో ఒక ప్రధాన పాత్రా చేయడానికి ఒప్పుకున్నారు. కాగా తాజాగా ఈ సినిమా గురించి మరో న్యూస్ తెలుగు ప్రేక్షకులను తనవైపు బాగా ఆకర్షిస్తోంది.
ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు పాన్ ఇండియా హీరో ప్రభాస్ ని అడిగినట్లు ఆయన సరే అన్నట్లు సమాచారం. చిన్న సినిమాలు అయినా తన దాకా రిక్వెస్ట్ వస్తే కాదనకుండా సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ముందుంటారు ఈ బ్యాచిలర్ స్టార్ హీరో . ఈ మధ్య జాతిరత్నాలు మూవీని కూడా ప్రమోట్ చేసి ఓ రేంజ్ లో సక్సెస్ అందుకున్న ఈ మూవీ సక్సెస్ లో భాగమయ్యారు డార్లింగ్. అయితే ఇపుడు గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా చేస్తున్న మూవీని సైతం ప్రమోట్ చేసేందుకు రెబల్ స్టార్ అంగీకరించారని వార్తలు వినపడుతున్నాయి.