పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా ఒకే సారి భీమ్లా నాయక్ మూవీ ని హరిహర వీరమల్లు మూవీ ని ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే,  కాకపోతే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'  సినిమాపై ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టడం,  అలాగే హరిహర వీరమల్లు సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి 'కొండపొలం'  సినిమా పై దృష్టి పెట్టడంతో దాదాపు  50 శాతం వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న తర్వాత హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ వాయిదా పడింది.  ఇది ఇలా ఉంటే ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా విడుదల అవ్వడం , అలాగే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన  కొండపొలం  సినిమా కూడా విడుదల కావడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ,  క్రిష్ జాగర్లమూడి ఇద్దరూ కూడా హరిహర వీరమల్లు సినిమాను తిరిగి ప్రారంభించనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి,  ఇది ఇలా ఉంటె హరిహర వీరమల్లు సినిమా దాదాపు 50 శాతం వరకు పూర్తి అయిన తర్వాత ఆగిపోయినట్లు అప్పట్లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెలియజేశాడు.  ఇది ఇలా ఉంటే 50 శాతం వరకు షూటింగ్ పూర్తి అయి వాయిదాపడిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఏప్రిల్ ఆరో తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది,  ఇది ఇలా ఉంటే  ఈ సినిమా మిగతా 50 శాతం చిత్రీకరణను పూర్తి చేయాలనే పట్టుదలతో పవన్ కళ్యాణ్ రంగం లోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

  ఇక ఈ మూవీ లేట్ కాకూడదనే ఉద్దేశంతో ఏకధాటిగా పవన్ కళ్యాణ్ 5 నెలల సమయాన్ని కేటాయించినట్టుగా చెబుతున్నారు,  ఆగస్టు వరకు ఈ సినిమాను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది,  ఈ సినిమాకు కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: