ఇక 2001 సంవత్సరంలో ప్రియమైన నీకు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన.. ఆ తర్వాత రాధాగోపాలం, శ్రీరామదాసు , వెంకీ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక సంక్రాంతి సినిమాలో కూడా నటించి ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ముఖ్యంగా రాధాగోపాలం సినిమాలో ఈమె నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా అందివ్వడం గమనార్హం . ముంబైలోని తెలుగు కుటుంబంలో జన్మించిన స్నేహ దుబాయిలో పెరిగింది. తర్వాత ప్రసన్న ను వివాహం చేసుకుంది.
కెరియర్ మొదట్లో మోడలింగ్ గా కూడా పని చేసిన స్నేహ ప్రస్తుతం తన భర్తతో కలిసి చెన్నై లో నివాసం ఉంటోంది . ఇక ఈమెకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇక ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ స్నేహ అందంలో ఏ మార్పు రాలేదు అనడంలో సందేహం లేదు. ఇప్పటికే అక్కడక్కడ బుల్లితెరపై పలు యాడ్ లు చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఇక తాజాగా అందమైన చీరకట్టులో పువ్వుల మకరందం లా చాలా అందంగా చూపరులను ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. స్నేహ కు సంబంధించిన ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి.