తాజాగా ఒక ఫోటో షూట్ నిర్వహించిన అందాల తార సీనియర్ నటి స్నేహ గ్లామర్ షో చూసి కుర్రకారు సైతం తడబడుతున్నారు. అంతేకాదు చీర కట్టులో ప్రేక్షకులను యువతను తన అందంతో కట్టిపడేస్తుంది ఈ,  ముద్దుగుమ్మ. నాలుగు పదుల వయస్సు దాటినా ఇప్పటికీ తన అందంలో ఏమాత్రం తేడా లేకుండా అప్పటికీ ఇప్పటికీ అందం తో దూసుకుపోతోంది అందాల తార స్నేహ. తెలుగు, తమిళ్ సినిమా లలో ఎక్కువగా నటించి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక ఈమె  అసలు పేరు సుహాసిని రాజారామ్ నాయుడు. మొదటిసారి అనిల్ బాబు దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ఇంగనే ఒరు నీల పక్షి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి 2000 వ సంవత్సరంలో అడుగు పెట్టింది.
ఇక 2001 సంవత్సరంలో ప్రియమైన నీకు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన.. ఆ తర్వాత రాధాగోపాలం,  శ్రీరామదాసు , వెంకీ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక సంక్రాంతి సినిమాలో కూడా నటించి ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ముఖ్యంగా రాధాగోపాలం సినిమాలో ఈమె నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా అందివ్వడం గమనార్హం . ముంబైలోని తెలుగు కుటుంబంలో జన్మించిన స్నేహ దుబాయిలో పెరిగింది. తర్వాత ప్రసన్న ను వివాహం చేసుకుంది.
కెరియర్ మొదట్లో మోడలింగ్ గా కూడా పని చేసిన స్నేహ ప్రస్తుతం తన భర్తతో కలిసి చెన్నై లో నివాసం ఉంటోంది . ఇక ఈమెకు ఒక అబ్బాయి  ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇక ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ స్నేహ అందంలో ఏ మార్పు రాలేదు అనడంలో సందేహం లేదు. ఇప్పటికే అక్కడక్కడ బుల్లితెరపై పలు యాడ్ లు చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఇక తాజాగా అందమైన చీరకట్టులో పువ్వుల మకరందం లా చాలా అందంగా చూపరులను ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. స్నేహ కు సంబంధించిన ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: