సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట.. పరుశురాం దర్శకత్వం వహిస్తున్న  ఈ సినిమా మొన్నీమధ్య షూటింగ్ ను పూర్తీ చేసుకుంది. హిరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది.మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తుండటంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ నుండి టీజర్లు, పాటలు ఈ సినిమాలోని పాటలు అంచనాలను రెట్టింపు కాగా తాజాగా మేకర్స్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.


వేసవి కానుకగా రాబోతోన్న ఈ సినిమాను మే 12న రిలీజ్ చేయనున్నారు. కేవలం పది రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ ను పెంచారు.అందులో భాగంగా సినిమాను తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఒక వైపు మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే కమర్షియల్ అంశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మాస్‌ను మెప్పించేలా పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ ఉండగా, ఆ డైలాగు ఇప్పుడు అనేక చర్చలకు దారి తీసింది.మహేష్ ఫ్యాన్స్, ప్రేక్షకుల నోట ఈ డ్తెలాగు గురించి విస్తృత చర్చలు జరుగుతున్నాయి.



నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ ట్రైలర్ లో మహేష్.. కీర్తితో చెప్పిన డైలాగ్ హిలేరియస్ గా పేలింది. ఈ డైలాగ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఎన్నికల ప్రచారంలో ఎన్నో సార్లు విన్న తెలుగు ప్రజలు ఇలా మహేష్ నోట వినడంతో ఆశ్చర్యపోతున్నారు. మహేష్ చెప్పిన ఈ డైలాగ్ తోనే ట్రైలర్ అదిరిపోయింది. పొలిటికల్ డైలాగ్ కి లవ్ ఎఫెక్ట్ ఇచ్చిన పరుశురాం మహేష్ నోట ఈ డైలాగ్ పలికించడం పై చెవులు కొరుకుంతున్నారు.అదే ట్రైలర్ కు హైలెట్ అయ్యిందని చెప్పాలి.సినిమాలో ఈ డైలాగ్, ఈ సీన్ ఎలా ఉంటుందో చూడాలి..ట్రైలర్ విడుదల అయిన కొద్ది గంటల లోనే ఇలా టాక్ ను అందుకోవడంతో గ్రేట్..సినిమా కూడా హిట్ అవుతుందని ప్రిన్స్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: