తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరైన సురభి గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందాల ముద్దుగుమ్మ సురభి శర్వానంద్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఎక్స్ ప్రెస్ రాజా మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది . 

మూవీ లో సురభి అందచందాలకు , నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.  ఆ తర్వాత అనేక టాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్  రేంజ్ విజయం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కించుకోలేకపోయింది. క్రేజీ సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలు దక్కకపోవడంతో సురభి మూవీ ల జోరు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్త తగ్గింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సురభి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సురభి కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళ్తే... తాజాగా సురభి కి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో సురభి లెహంగా వేసుకొని అదిరిపోయే రేంజ్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న  ఫోటోలలో సురభి ధరించిన లెహంగా  ధర  1,28,000 అని తెలుస్తోంది. కాస్ట్లీ లెహంగా లో సురభి తన అందచందాలతో అదరగొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: