సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమందికి మాత్రమే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాలు దక్కుతూ ఉంటాయి. ఇలా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న ముద్దుగుమ్మలలో కీర్తి సురేష్ ఒకరు.  

ఈ ముద్దుగుమ్మ నేను శైలజ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నేను లోకల్ సినిమాతో  మరో విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంది. ఆ తర్వాత మహానటి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కీర్తి సురేష్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా, నటిగా ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి ఎన్నో గొప్ప ప్రశంసలను అందుకుంది. ఇలా మహానటి సినిమాతో నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు మరియు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా సర్కారు వారి పాట మూవీ తో  బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. 

ఇలా తెలుగు , తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కీర్తి సురేష్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో కీర్తి సురేష్ పింక్ కలర్ శారీ ని కట్టుకొని,  అందుకు తగిన పింక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. కీర్తి సురేష్ కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ  వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: