సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది సీనియర్ నటులు అనారోగ్యం కారణంగా మరణిస్తే.. మరికొంత మంది నటులు చిన్న వయసులోనే కొన్ని రకాల జబ్బుల కారణంగా స్వర్గస్తులు అవుతున్నారు. అయితే కరోనా మహమ్మారి వచ్చిన రోజు నుంచి కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర భాషా సినీ పరిశ్రమలో కూడా విపరీతమైన మరణాలు చోటు చేసుకుంటూ ఉండడం సినీ ఇండస్ట్రీకి దుఃఖాన్ని మిగులుస్తోంది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ క్రమంలోనే తాజాగా మరొక కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటుడు మరణించడం వివాదాస్పదంగా మారింది. ఆయన సహజంగా మరణించలేదని హత్యకు గురయ్యాడు అని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొనడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశం గా  మారుతోంది. మరొక నటుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్.. యూట్యూబర్ అయిన సతీష్ వజ్ర హత్యకు గురయ్యాడు.. సతీష్ బావమరిది ఆ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. బెంగళూరులోని ఆర్ ఆర్ నగర్ పరిధిలో బసవనగుడి ప్రాంతంలోని తన ఇంట్లో రక్తపు మడుగులో ఉన్న సతీష్ ను ఇరుగుపొరుగువారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.. ఇక శనివారం ఈ హత్య జరిగినట్లు సమాచారం.


సొంతంగా సెలూన్ నిర్వహిస్తున్న ఆయన కు చాలా మంది హీరోలు కస్టమర్లుగా ఉన్నారు .ఇక కన్నడ చిత్రం లగోరి తో పాటు కొన్ని సీరియల్స్ లో కూడా సతీష్ నటించారు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఆయన నిర్వహిస్తుండడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఈయన వయసు 36 సంవత్సరాలు. సతీష్ మండ్యా ప్రజ్వల్ దేవరాజు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా సతీష్ భార్య దాదాపు 8 నెలల క్రితమే ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి సతీష్ వేధింపులే కారణమని ఆమె సోదరులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు సతీష్ ను హత్య చేసినట్లు సమాచారం. ఇకపోతే పోలీసులు సతీష్ బామ్మర్ది తోపాటు ఇంకొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: