తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంట్ ఉన్న నటుల్లో ఒకరు అయిన సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సత్యదేవ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస మూవీ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో తన కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

అందులో భాగంగా సత్యదేవ్ ప్రస్తుతం కృష్ణమ్మ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో ఉన్న సత్యదేవ్ తాజాగా గాడ్సే అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సత్యదేవ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించగా,  గోపీ గణేష్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జూన్ 17 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలయ్యింది. కాక పోతే ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకో లేకపోవడంతో ఈ సినిమా చివరకు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక అపజయం పాలు అయినా గాడ్సే సినిమా మరి కొన్ని రోజుల్లో  'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి రాబోతోంది. గాడ్సే సినిమా నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో జులై 17 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఎవరైనా గాడ్సే మూవీ ని థియేటర్ లలో చూద్దాము అని మిస్ అయిన వారు ఉంటే జూలై 17 వ తేదీ నుండి ఈ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతోంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: