ప్రస్తుతం 'అఖండ' విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. ఇక అదే జోష్‌ను తన నెక్ట్స్ సినిమాలో కూడా కంటిన్యూ చేస్తున్నాడు.అయితే ప్రస్తుతం ఈయన హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ పొలిటికల్ సినిమా చేస్తున్నాడు.అంతేకాదు  ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.ఇక  బాలయ్య ఈ చిత్రంలో రెండు గెటప్‌లలో కనిపించబోతున్నట్లు టాక్.ఇకపోతే  'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపిచంద్ మలినేని, బాలకృష్ణతో సినిమా చేయనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

అయితే ఇప్పటికే విడుదలైన బాలయ్య పోస్టర్‌లు విశేషంగా ఆకట్టుకున్నాయి.కాగా  ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేస్తున్నట్లు గతంలో మేకర్స్ పేర్కొన్నారు.ఇదిలావుండగా తాజాగా ఈ చిత్రం దసరా రేసు నుండి తప్పకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి కారణం బాలకృష్ణకు రెండు సార్లు కొవిడ్ రావడం.అయితే  అంతేకాకుండా పలువురు టెక్నీషియన్‌లకు కూడా కొవిడ్ రావడంతో షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది.ఇక  ఇంకా షూటింగ్ పార్ట్ చాలానే ఉందట.అయితే దాంతో ఈ చిత్రం దసరా రేసు నుండి తప్పుకోనుందట.ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇకపోతే బాలయ్య చిత్రానికి అన్నగారు అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు టాక్.కాగా  ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది.అయితే  కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలావుంటే ఇటీవలే ఈయన షూటింగ్‌లో పాల్గొన్నాడు.ఇక  సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నాడు.కాగా  ఎస్ఎస్‌. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇకపోతే  ఇప్పటికే దసరా రేసులో చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’, నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే.అంతేకాకుండా  చాలా కాలం తర్వాత వీరిద్దరి మధ్య పోటీ రావడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.మరి చిరంజీవి నాగార్జున ఇద్దరిలో ఎవరి సినిమా సక్సెస్ ని సాధిస్తుందో తెలియాలంటే ఈ సినిమాలు విడుదల అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: