టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటు వంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో ఖుషి సినిమా ఒకటి. 2001 వ సంవత్సరంలో విడుదల అయినా ఖుషి సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయంగా నిలవడం మాత్రమే కాకుండా సన్షేషనల్ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్ల గొట్టింది. ఈ మూవీకి ఎస్ జె సూర్య దర్శకత్వం వహించగా ,  భూమికా చావ్లా , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడి గా ఈ మూవీ లో నటించింది.

మూవీ కి మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ విజయంలో మణిశర్మ సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే మళ్ళీ ఖుషి సినిమాను రీమేక్ ఎవరు చేయాలి అనే విషయంపై సాయి ధరమ్ తేజ్ తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా గిరిశయ్య దర్శకత్వంలో రంగ రంగ వైభవంగా మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర బృందం తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది.

ఈవెంట్ వేడుకలో భాగంగా సాయి ధరమ్ తేజ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమాని రీమేక్ చేయాలి అంటే మీలో ఎవరు చేస్తారు అనే ప్రశ్న ఎదురైంది ...  ఈ ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ నిజానికి ఖుషి మూవీ ఒక పవర్ఫుల్ ఎంటర్టైనర్ అని , అలానే ఆ మూవీ రీమేక్ తో పాటు అందులోని సిద్దు పాత్ర ను చేయగల సత్తా వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ కి మాత్రమే ఉందని తాజాగా రంగ రంగ వైభవంగా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్ చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: