టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ పూజా హెగ్డే. ఇక ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ఇక తన కెరియర్ లో ఫ్లాప్ లు హిట్టులు సంబంధం లేకుండా దూసుకుపోతోంది. భాషతో సంబంధం లేకుండా ఇతర హీరోలతో కూడా నటిస్తున్నది ఇక టాలీవుడ్ లో కోలీవుడ్లో, బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటుంది. అయితే ఇటీవలే ఒకేసారి ఈ ముద్దుగుమ్మ నటించిన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి.

అయితే ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులలో బిజీగా ఉన్న పూజా హెగ్డే ఈ మూడు సినిమాలు ఊహించని స్థాయిలో ఫ్లాప్ అయ్యి ఈమెకు నెగిటివ్ మార్కులు తెచ్చిపెట్టాయి. దీంతో ఈమె కెరియర్ కాస్త డల్ అయినట్లుగా కనిపిస్తున్నది. ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కబీ ఈద్ కబీ దివాళి అనే సినిమాలో నటిస్తున్నది అలాగే రణవీర్ సింగ్ తో కూడా ఒక సినిమాలో నటిస్తున్నది. ఇక ఇవే కాకుండా అప్పుడప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నది.ఒకవైపు సినిమాలలో మరొకవైపు వాణిజ్య ప్రకటనలో నటిస్తూ తనకు సమయం దొరికినప్పుడల్లా ఇలా వెకేషన్ లకు తిరుగుతూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం తరచూ ఆక్టివ్ గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇది ఏమైనా ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నది. ప్రస్తుతం పూజ హెగ్డే ప్రతిరోజు కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నది. అయితే ఈమె ఇలా ప్రతిరోజు షేర్ చేయడం వల్ల పూజ హెగ్డే కి సినిమా షూటింగ్ అవకాశాలు తగ్గి ఇలా చేస్తుందా అంటూ పలువురు మెటీరియల్ సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా పూజ హెగ్డే ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: