కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ తాజాగా బీస్ట్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా నెల్సన్ దిలీప్ కుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

మూవీ తమిళ్ తో పాటు తెలుగు ,  హిందీ , కన్నడ ,  మలయాళ భాషల్లో ఏప్రిల్ 13 వ తేదీన విడుదల అయ్యింది. భారీ కంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన బీస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయిన బీస్ట్ మూవీ తాజాగా జెమినీ టీవీ లో తెలుగు లో ప్రసారం అయ్యింది.  ఈ మూవీ మొదటి సారి తెలుగు లో జెమినీ టీవీ లో ప్రసారం అయినప్పుడు 5.94 'టి ఆర్ పి' ని సాధించింది.

ఒక డబ్బింగ్ సినిమా అయి ఉండి , అందులోను బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయిన బీస్ట్ మూవీ మొదటి సారి తెలుగు లో బుల్లి తెర పై ప్రసారం అయినప్పుడు ఈ రేంజ్ లో 'టి ఆర్ పి' ని సాధించడం గొప్ప విషయం అనే చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తలపతి విజయ్ , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరిసు (వారసుడు) మూవీ లో  హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: