అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ త్రీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న వరుణ్ తేజ్ తాజాగా మరో సినిమాని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈయన తన తదుపరి సినిమా విషయానికి సంబంధించి కీలక అప్డేట్ విడుదల చేశారు.ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ యదార్థ సంఘటనల ఆధారంగా ఓ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

బౌండెడ్‌ స్క్రిప్ట్ ని చదివి సాటిస్ఫై అయిన వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాని ఓకే చేసినట్టుగా ఈ వీడియోలో ఉంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరు ఏ బ్యానర్ లో ఈ సినిమా రాబోతుంది అనే విషయం గురించి ఎలాంటి విషయాలను వెల్లడించలేదు అయితే త్వరలోనే ఈ విషయాలన్నింటినీ వెల్లడించనున్నట్లు సమాచారం. ఇక ఈయన ఈ విషయం గురించి తెలియజేస్తూ చేసిన పోస్ట్ఆ కాశాన్ని తాకే ఇండియా గ్లోరీ` అనే అర్థంలో వరుణ్‌ తేజ్‌ ఈ పోస్ట్ చేశారు.

 

ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది.ఇకపోతే గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి వరుణ్ బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్3 సినిమా ద్వారా హిట్ అందుకున్న ఈయన తన తదుపరిచిత్రాన్ని తన తండ్రి నిర్మాణంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ ఈయన మాత్రం తన తదుపరి సినిమా గురించి త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

 

మరి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రాబోయే సినిమానే ఇలా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుందా..ఈ సినిమాని తన తండ్రి నాగబాబు అంజనా ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మించబోతున్నారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. అయితే వరుణ్డైరెక్టర్ తో చేయబోతున్నారు అనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: