మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చే సమయం లో ఆయన ఎన్నో కథలను విన్నారు..కానీ ఏ ఒక్క కథ కూడా ఆయన అంచనాలకు అందకపోవడం తో రిజెక్ట్ చేస్తూ వచ్చారు..చివరికి తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన విజయ్ సూపర్ హిట్ మూవీ కత్తి ని 'ఖైదీ నెంబర్ 150' గా రీమేక్ చేసి మన ముందుకి వచ్చాడు..ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ అనేది మన అందరికి తెలిసిందే.
బాహుబలి సినిమా తర్వాత తెలుగు లో వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకున్న ఏకైక సినిమా ఇదే..అయితే మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా వాస్తవానికి ఖైదీ నెంబర్ 150 తో కాదు..పూరి జగన్నాథ్ 'ఆటో జానీ' అనే సినిమాతో జరగాల్సింది..ఫస్ట్ హాఫ్ చిరంజీవి గారికి అద్భుతంగా నచినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం నేటి తరం ఆడియన్స్ కి బిన్నంగా నాసిరకంగా అనిపించడం తో ఈ చిత్రం లో నటించడానికి నిరాకరించాడు.

ఇటీవల పూరి జగన్నాథ్ తో జరిగిన ఇంస్టాగ్రామ్ లైవ్ వీడియో చాట్ లో కూడా చిరంజీవి 'నా ఆటో జానీ సినిమా ఉంచావా..లేదా పక్కన పాడేశావా' అని అడగడం తో పూరి జగన్నాథ్ దానికి సమాధానం చెప్తూ 'లేదు సార్..దానికంటే అద్భుతమైన స్టోరీ తో మీ ముందుకు వస్తాను' అంటూ చెప్పుకొచ్చాడు..అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే ఇప్పుడు ఆ ఆటోజానీ అనే స్క్రిప్ట్ ని బాలయ్య బాబు తో చెయ్యాలని ఆలోచిస్తున్నాడు పూరి జగన్నాథ్..గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో పైసా వసూల్ అనే సినిమా వచ్చింది..బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినప్పటికీ కూడా ఒక వర్గం మాస్ ప్రేక్షకులకు ఈ చిత్ర తెగ నచ్చేసింది..ఇప్పుడు అతి త్వరలో మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ 'ఆటో జానీ' రాబోతుందని తెలుస్తుంది.
పూరి జగన్నాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన లైగర్ సినిమా ఈ ఏడాది విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఫ్లాప్ ఇమేజి నుండి వెంటనే బయటపడాలి అనుకుంటున్నాడు పూరి జగన్నాథ్..అందుకోసం ఆటో జానీ స్క్రిప్ట్ ని ఎంతో పవర్ ఫుల్ గా తీర్చి దిద్దడానికి సమయం తీసుకుంటున్నాడట..మరి ఈ సినిమా తో బాలయ్య బాబు కి పూరి జగన్నాథ్ తిరుగులేని హిట్ ఇస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: