అనసూయ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. ఎందుకంటే ఓ వైపు బుల్లితెర, వెండితెర ప్రేక్షకులను అలరిస్తూనే.. నిత్యం సోషల్మీడియాలో వివాదస్పద  వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ట్రోలర్స్ ఆమెను అస్సలు వదలట్లేదు. సోషల్ మీడియాలో ఆమెను నెటిజెన్స్ ఏకిపారేస్తున్నారు. కామెంట్స్ రూపంలో ఆంటీ అంటూ చుక్కలు చూపిస్తున్నారు.

అనసూయ ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్స్ చేసినా నెటిజెన్స్ ఇరిటేట్ చేస్తున్నారు. నెగిటివ్ కామెంట్స్తో రచ్చ చేస్తున్నారు. ఆంటీ అంటూ సోషల్ మీడియా వేధింపులకు దిగిన వారిపై అనసూయ ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ఆధారాలుగా ఇచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు పెట్టినా, హెచ్చరించినా నెటిజెన్స్ భయపడ్డ సూచనలు కనిపించడం లేదు.

తాజాగా అనసూయ ఫ్యామిలీతో కలిసి విజయవాడ వెళ్లారు. ఆ ఫోటోలు చూస్తే ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఉన్నారు. ప్రత్యేక పూజలు జరిపించడంతో పాటు గోశాలలు సందర్శించారు. తన ట్రిప్కు సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ పంచుకోని అనసూయ, జస్ట్ విజయవాడ అని కామెంట్ పెట్టారు.
ఇది చూసిన నెటిజన్లు అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలపై ట్రోల్స్తో విరుచుకుపడుతున్నారు. హ్యాపీ జర్నీ ఆంటీ, అంకుల్-ఆంటీ అని కామెంట్స్ పెడుతున్నారు. ఓ నెటిజెన్ అయితే ‘నీ మెడలో ఎన్నాళ్లకు తాళిబొట్టు కనిపించింది’ అని కామెంట్ పెట్టాడు. మెజారిటీ కామెంట్స్ ఆంటీ పదంతో నిండిపోయాయి. ఎంత ప్రయత్నం చేసినా వదలకుండా వేటాడుతున్న ట్రోలర్స్ను ఎలా కంట్రోల్ చేయాలో అనసూయకు అర్థం కావడం లేదు.

కాగా ఆంటీ వివాదంలో అనసూయదే తప్పని మెజార్టీ వర్గాల అభిప్రాయం. లైగర్ ప్లాప్ సంతోషం కలిగించిందంటూ చెప్పి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని ఆమె రెచ్చగొట్టారు. అమ్మను తిట్టిన కారణంగా లైగర్ ప్లాప్ అయ్యిందంటూ అనసూయ ఇండైరెక్ట్  చేసింది. అసలే డిజాస్టర్ టాక్ తో మంట మీదున్న విజయ్ ఫ్యాన్స్ పుండుపై అనసూయ కారం చల్లారు. దాంతో వాళ్ళు రెచ్చిపోయారు.

లైగర్ చెత్త సినిమా అంటూ సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోల్స్ పడుతున్న సమయంలో అనసూయ . ఆంటీ వివాదం తెరపైకి రాగానే లైగర్ మూవీ ట్రోల్స్ పక్కదారి పట్టాయి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వర్సెస్ అనసూయ వివాదం సోషల్ మీడియాలో హైలెట్గా మారింది. ఏకంగా మూడు రోజులు ఆంటీ హ్యాష్ ట్యాగ్  అయ్యిందంటే వివాదం ఏ రేంజ్లో అయిందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: