తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో శ్రీను వైట్ల ఒకరు. శ్రీను వైట్ల ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి , టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన దర్శకుడిగా గుర్తింపును దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే దశకుడు శ్రీను వైట్ల గత కొంతకాలంగా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనుకబడిపోయాడు. శ్రీను వైట్ల వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజాయలను ఎదుర్కొంటూన్నాడు. శ్రీను వైట్ల ఆఖరుగా రవితేజ హీరోగా ఇలియానా హీరోయిన్ గా తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ తర్వాత శ్రీను వైట్ల ,  మంచు విష్ణు హీరోగా డీ అండ్ డీ (డబల్ డోస్) అనే పేరుతో ఒక మూవీ ని అనౌన్స్ చేశాడు. కాకపోతే ఆ సినిమా ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇది ఇలా ఒక కొన్ని రోజుల క్రితమే శ్రీను వైట్ల , గోపీచంద్ తో ఒక మూవీ ని చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.

మూవీ మరికొన్ని రోజుల్లోనే సెక్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే శ్రీను వైట్ల తన మూవీ ల స్పీడ్ ను మరింత పెంచినట్లు తెలుస్తోంది. గోపీచంద్ తో సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే శ్రీను వైట్ల మరో మూవీ ని సెట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.

శ్రీను వైట్ల తాజాగా రామ్ పోతినేని కి ఒక కథను వినిపించినట్టు , ఆ కథ బాగా నచ్చిన రామ్ పోతినేని కూడా శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ గోపీచంద్ సినిమా తర్వాత ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వరకే రామ్ పోతినేని , శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన రెడీ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: