అందాల ముద్దుగుమ్మ అను ఇమాన్యుయల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ 2016 వ సంవత్సరంలో విడుదల అయిన మజ్ను మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన విరించి వర్మమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం , అలాగే ఈ మూవీ లో అను ఇమాన్యుయల్ తన అంద చందాలతో , నటన తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి క్రేజీ అవకాశాలు దక్కాయి.  

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసి మూవీ లో హీరోయిన్ గాను , అల్లు అర్జున్ సరసన నా పేరు సూర్య ... నా ఇల్లు ఇండియా మూవీ లోను , నాగ చైతన్య సరసన శైలజ రెడ్డి అల్లుడు మూవీ లోని హీరోయిన్ గా నటించింది. వీటితో పాటు పలు మూవీ లలో అను ఇమాన్యుల్ హీరోయిన్ గా నటించింది. కాకపోతే ఈ ముద్దుగుమ్మ నటించిన మూవీ లు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అను ఇమ్మానుయేల్ క్రేజ్ అమాంతం పడిపోయింది.

ఇలా వరుస అపజయాలతో డీల పడిపోయిన అను ఇమాన్యుల్ తాజాగా అల్లు శిరీష్ హీరోగా రాకేష్ శశి దర్శకత్వంలో దొరకెక్కిన ఊర్వశివో రాక్షసివో అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ కనక మంచి విజయం సాధించినట్లు అయితే అను ఇమాన్యుల్ కి మళ్లీ అద్భుతమైన క్రేజీ లభించే అవకాశం ఉంది. మరి ఊర్వశివో రాక్షసివో మూవీ తో అను ఇమాన్యుయల్ ఏ రేంజ్ క్రేజ్ ను సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: