బాలీవుడ్  స్టార్   హీరో 'షారుఖ్ ఖాన్‌' చాలారోజుల తర్వాత వెండి తెరపై వస్తున్నాడు. ఆయన మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానుల కోసం సర్ ప్రైజ్ న్యూస్ అయితే వచ్చింది.షారుఖ్ కొత్త మూవీ 'పఠాన్' టీజర్ రిలీజ్ అయ్యింది. అందులో తమ అభిమాన నటుడిని చూసుకొని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు. షారుఖ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ ను ఫైట్, యాక్షన్ సీన్స్ తో ఆసక్తికరంగా మలిచారు. 'పఠాన్ గురించి మీకు ఏం తెలుసు' ? అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది.'మూడేళ్ల నుంచి అతడి జాడ లేదు.. చివరి మిషన్ లో పట్టుబడ్డాడు. పఠాన్ ఇంకా బతికి ఉన్నాడో లేదో తెలియదు' అని ఓ వ్యక్తి అనడం.. 'బతికే ఉన్నా' అంటూ తనదైన శైలిలో షారుఖ్ చెప్పడం అభిమానుల్లో హుషారు రేకెత్తిస్తుంది. పొడవాటి జుట్టు, రక్తపు మరకలతో షారుఖ్ డిఫరెంట్ గా కనిపించాడు.ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు. జాన్ అబ్రహం కూడా కనిపించాడు. అతనితో షారుఖ్ ఎందుకు ఫైటింగ్ చేస్తాడు ? ఇంతకీ పఠాన్ ఎవరు ? జాన్ అబ్రహం పాత్ర ఏంటీ ? అనే ఆసక్తికర అంశాలతో టీజర్ రూపొందించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కించారు.


 వచ్చే సంవత్సరం జనవరి 25న 'పఠాన్' మూవీ విడుదల కానుంది.అయితే  తెలుగు అభిమానులు మాత్రం ఈ సినిమాని తెగ ట్రోల్  చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ప్రభాస్  అభిమానులు తెగ ట్రోల్  చేస్తున్నారు.ఎందుకంటే ఆదిపురుష్   టీజర్  రిలీజ్  అయినప్పుడు నార్త్  వాళ్ళు తెగ ట్రోల్  చేశారు. గ్రాఫిక్స్  కార్టూన్ లా  ఉన్నాయని ట్రోల్  చేశారు. అందుకు తెలుగు అభిమానులు పఠాన్  టీజర్  ఏం బాగాలేదంటూ తెగ బాగా ట్రోల్  చేస్తున్నారు. దీంతో షారుక్  ఫ్యాన్స్  ప్రభాస్  ఫ్యాన్స్  మధ్య పెద్ద ఫైట్  అనేది నడుస్తుంది.ఇక షారుఖ్ విషయానికి వస్తే.. వెండి తెరకు ఇతను చాలానే గ్యాప్ ఇచ్చాడని చెప్పొచ్చు. 2018లో వచ్చిన 'జీరో' సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత సినిమా చేయాలని అనుకున్నా.. వివిధ కారణాల వల్ల వీలు కాలేదు. అనంతరం ఏకంగా వివిధ సినిమాలకు ఓకే చెప్పేశారు. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ ఫిల్మ్ లో షారుఖ్ డ్యూయల్ రోల్ పోషించనున్నారని తెలుస్తోంది. రాజ్ కుమార్ హిరాణీతో ఓ సినిమాకు కమిట్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: