తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ కెరియర్ ప్రారంభంలో కొన్ని మూవీ లలో నటించినప్పటికీ ఆ మూవీ లు ఈ హీరో కు పెద్దగా గుర్తింపును తెచ్చి పెట్టలేక పోయాయి. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి చూపులు మూవీ మంచి విజయం సాధించడంతో విజయ్ దేవరకొండ కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ,  గీతా గోవిందం ,  టాక్సీ వాలా వంటి విజయవంతమైన మూవీ లతో విజయ్ దేవరకొండ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా మారిపోయాడు.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న విజయ్ దేవరకొండ కొన్ని రోజుల క్రితమే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గ నటించగా ,  మైక్ టైసన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు.  రమ్యకృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది. తెలుగు తో పాటు హిందీ ,  కన్నడ , తమిళ , మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల అయిన మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అంచనాలను అందుకోలేక అపజయం పాలయ్యింది.

ఇది ఇలా ఉంటే లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ కు భారీ ఆఫర్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కరణ్ జోహార్ నిర్మాతగా తెరకెక్కబోయే ఒక మూవీ లోను ,  రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో మరో మూవీ లోను విజయ దేవరకొండ కు మూవీ ఆఫర్ లు వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: