టాలీవుడ్ యువ హీరో లలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ "పెళ్లి చూపులు" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి , గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ "లైగర్" అనే పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ కి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా , అనన్య పాండేమూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం ,  ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో లైగర్ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర గోరపరాజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ "ఖుషి" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

సమంత ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  శివ నర్వనా ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ ఇంకా 5 వారాలు మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా షూటింగ్ పూర్తి కాని ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే పూర్తి అయినట్లు సమాచారం. ఖుషి మూవీ కి దాదాపు ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: