టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి రష్మిక మందన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఛలో మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప మూవీ తో రష్మిక మందన పన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన తమిళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న వరిసు మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. వంశీ పైడిపల్లిమూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే రష్మిక మందన ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా పలు ప్రాజెక్ట్ లలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా తాజాగా రష్మిక మందన సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కిన మిషన్ మజ్ను అనే స్పై థ్రిల్లర్ మూవీ లో హీరోయిన్ గా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని నేరుగా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 18 జనవరి 2023 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. శంతను బాగ్చి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  బాలీవుడ్ అగ్ర నిర్మాత రోనీ స్క్రూవాలా అమర్ బుటాలా మరియు గరిమా మెహతాతో కలిసి ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: