మాజీ హీరోయిన్ మరియు ఏపీ మంత్రి రోజా గురించి ఇప్పటి ప్రజలకు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఈ రోజు రోజా తన పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈమె తిరుమలను దర్శించుకుని ఆ వేంకటేశుని స్మరించుకున్నారు. తిరుమలలో దర్శించుకున్న వారిలో రోజాతో పాటుగా జబర్దస్త్ వర్ష మరియు సింగర్ మంగ్లీ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుండి రోజా కూతురు సినిమా ఎంట్రీ గురించి సోషల్ మీడియా లోనూ మరియు తెలుగు సినిమా పరిశ్రమ లోనూ జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక కొన్ని వెబ్ చానెళ్లు అయితే ఫలానా సినిమాలో హీరోయిన్ గా రోజా కూతురు అన్షు మల్లిక ఎంట్రీ ఇవ్వనుందని కూడా రాశారు.  కానీ ఇన్ని రోజులకు ఈ రోజు రోజా తన కూతురు సినీ ఎంట్రీ పై షాకింగ్ వ్యాఖ్యలు చేసి పుకార్లు అన్నీ సద్దుమణిగేలా చేసిందని చెప్పాలి. ఈమె మాట్లాడుతూ ఒక నటిగా నేను నా పిల్లలు కూడా సినీ రంగంలో అడుగుపెట్టాలని అనుకుంటున్నాను. కానీ నా పిల్లలకు ఏ రంగం వైపు వెళ్లాలో ఎంచుకునే పూర్తి స్వాతంత్య్రం వారికిచ్చాను అని చెబుతూనే, అన్షు కు బాగా చదువుకుని పెద్ద సైంటిస్ట్ అయ్యి దేశానికి మంచి పేరు తీసుకురావాలన్న లక్ష్యాన్ని పెట్టుకుందని చెప్పడంతో షాక్ అవ్వడం అభిమానుల వంతయ్యింది.

చివరగా, ఒకవేళ ఈ మధ్యలో ఎప్పుడైనా అన్షుకు నటన వైపు వెళ్లాలన్న ఆలోచన ఉంటే నేను తప్పక నా సపోర్ట్ మరియు ఆశీర్వాదాలు అందిస్తానని చెప్పింది. రోజా ఇచ్చిన క్లారిటీతో అన్షు మల్లిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం లేదని స్పష్టం అయిపోయింది. రోజా తన పుట్టిన రోజును పురస్కరించుకుని టాలీవుడ్ అభిమానులకు ఈ విధంగా షాక్ ఇచ్చారు అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి రెండవసారి విస్తరించిన మంత్రివర్గంలో టూరిజం శాఖకు మంత్రిగా అయ్యి ప్రతిపక్షముపై ఫైర్ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: