కోలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటు వంటి దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఈ సంవత్సరం బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా , ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన బీస్ట్ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరిసు అనే తమిళ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ ని తెలుగు లో డబ్ చేసి వారసుడు అనే టైటిల్ తో పేరుతో విడుదల చేయనున్నారు. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి మూవీ యూనిట్ "రంజితమే" అని పాటను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే వరసు మూవీ యూనిట్ ఈ సినిమా బిజినెస్ ను కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.

అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను కూడా ఓ ప్రముఖ సంస్థకు అమ్మివేసినట్లు సమాచారం. వరిసు మూవీ ఓవర్సీస్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ 35 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై విజయ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: