టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి పరశురరామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఇప్పటికే ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో పరుశురామ్ "గీత గోవిందం" అనే మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తో పరశురామ్ ఇమేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత ఈ దర్శకుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ కి దర్శకత్వం వహించాడు. పరశురామ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కారు వారి పాట అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే పరశురామ్ తన తదుపరి మూవీ ని నందమూరి నటసింహం బాలకృష్ణ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ దర్శకుడు బాలకృష్ణ కోసం ఒక అదిరిపోయే పవర్ఫుల్ స్టోరీ ని కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

పరుశురామ్ బాలకృష్ణ కోసం తయారు చేసిన కథ లో బాలకృష్ణ సీఎం పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో బాలకృష్ణ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ అధికారికంగా ప్రారంభం కూడా అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: