తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి ఇప్పటికీ కూడా అద్భుతమైన ఫామ్ ను ఇండస్ట్రీలో కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న బాలకృష్ణ తన వ్యక్తిత్వంతో కూడా ఎంతో మంది మనుషులను దోచుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు మరియు బయటి వాళ్లు కూడా బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని అనేక సందర్భాల్లో పొగిడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా వీర సింహా రెడ్డి మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన రిషి పంజాబీ కూడా బాలకృష్ణ వ్యక్తిత్వం పై ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా రిషి పంజాబీ మాట్లాడుతూ ... బాలకృష్ణ తో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభవం అని పేర్కొన్నాడు. అలాగే సెట్స్ లో బాలకృష్ణ అందరితో చాలా సరదాగా ఉంటారు అని ... ప్రతి ఒక్కరితో ఎంతో మర్యాదగా ఉంటారు అని ... అలాగే పని విషయంలో మాకు ఎంతో స్వేచ్ఛను ఇస్తారు అని ... అలాగే ఆయనకు స్టార్ హీరో అనే అహం ఏ మాత్రం ఉండదు అని చెప్పుకొచ్చాడు.

అలాగే వీర సింహా రెడ్డి మూవీ అభిమానుల అంచనాలను అందుకుంటుంది అని రిషి పంజాబీ చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర సింహా రెడ్డి మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... గోపీచంద్ మలినేని ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ సంస్థ నిర్మించిన ఈ మూవీ ని ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: