నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మైత్రి సంస్థ నిర్మించిన ఈ మూవీ కి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించగా , సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో దునియా విజయ్ , వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించారు. ఈ మూవీ జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ధియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రోజు వారిగా ఏ రేంజ్ కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 31.05 కోట్ల షేర్ , 50.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మూవీ రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా 6.15 కోట్ల షేర్ , 11.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మూవీ 3 వ రోజు ప్రపంచవ్యాప్తంగా 7.30 కోట్ల షేర్ , 12.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మూవీ 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 8.15 కోట్ల షేర్ , 14.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మూవీ 5 వ రోజు ప్రపంచవ్యాప్తంగా 7.25 కోట్ల షేర్ , 12.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా వీర సింహా రెడ్డి మూవీ 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా 59.90 కోట్ల షేర్ ,  100.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి ప్రస్తుతం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: