ఇక ఘోస్ట్ లాంటి డిజాస్టర్ సినిమా తరువాత అక్కినేని నాగార్జున సినిమాలకు కొద్దిగా గ్యాప్ తీసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ప్లాప్ అయ్యాక ఈ మధ్య సోషల్ మేడీయాలో చాలా తక్కువగా కనిపిస్తున్న నాగార్జున బయట జరిగే విషయాలను అంత ఎక్కువగా పట్టించుకోవడంలేదని సమాచారం తెలుస్తోంది. ఇక సినిమాలతో పాటు నాగ్ కమర్షియల్ యాడ్స్ లో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు. టాలీవుడ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు తరువాత ఎక్కువ యాడ్స్ లో కనిపించే ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే.. అది ఖచ్చితంగా నాగ్ మాత్రమే అని చెప్పాలి. ఘడి డిటర్జెంట్ పౌడర్ ఇంకా అలాగే కళ్యాణ్ జువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న నాగ్ మరో కొత్త వాణిజ్య ప్రకటనలో కూడా కనిపించి ఎంతగానో మెప్పించాడు. టాలీవుడ్ హాట్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే తో కలిసి మాజా యాడ్ లో నాగ్ నటించి ఎంతగానో సందడి చేశాడు. బుట్ట బొమ్మ పూజా హెగ్డే గత కొంత కాలంగా మాజాకి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే.


 నాగార్జున, పూజా హెగ్డే వీరిద్దరు కలిసి ఈ మధ్యనే ఈ యాడ్ షూట్ లో పాల్గొన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఇక తాజగా ఈ యాడ్ ను నాగ్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.ఇక ఈ ప్రకటనలో నాగ్ ఇంకా అలాగే పూజా ఒకే అపార్ట్మెంట్ లో నివసించేవారిగా కనిపించారు. మాజా డ్రింక్ గొప్పతనం మొత్తం మామిడి కాయలోనే ఉందని చెప్తూ.. మామిడికాయ మంచితనం గురించి నాగార్జున వివరించాడు. ఇక ఈ యాడ్ లో మన మన్మధుడు లుక్ అయితే ఎప్పటిలాగే అదిరిపోయింది. హాట్ గా వుండే పూజా హెగ్డే పక్కన కుర్ర హీరోలానే నాగ్ కనిపించాడు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక యాడ్ ను చూసిన వారందరు కూడా యాడ్స్ సరే.. సినిమా ఎప్పుడు సార్ ? అంటూ నాగార్జున పోస్ట్ కి కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం కింగ్ నాగార్జున బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. మరి ఈ సినిమాతో నాగార్జున అభిమానులను ఎలా ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: