టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలకృష్ణ హోస్ట్ గా  వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కి ఇటీవల గెస్ట్ గా వచ్చాడు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో ఈ సీజన్ ముగిసింది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ వచ్చిన ఈ ఎపిసోడ్ని రెండు భాగాలుగా విడుదల చేశారు. ఇక మొదటి భాగంలో పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలకు సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు. రెండో పార్ట్ లో భాగంగా ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు.. అలాగే జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకున్నాడు పవన్ కళ్యాణ్.. 

ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి ఉన్న ఒక వ్యాధి గురించి బయట పెట్టడం జరిగింది..పవన్ కళ్యాణ్ 6, 7 తరగతిలో ఉన్నప్పుడు ఆయనకి ఆస్తమా జ్వరం వంటి అనారోగ్యం ఉండేదట.. ఇక ఆనారోగ్యంతో చాలా బాధపడే వాడట పవన్ కళ్యాణ్.. అంతేకాకుండా ఆ సమయంలో తనకి ఈ వ్యాధి ఉన్న కారణంగా తన స్నేహితులు కూడా తనతో ఉండకపోయేవారట.. దాంతో ఒంటరిగా ఎప్పుడూ పుస్తకాలను చదువుతూ ఉండేవాడట పవన్ కళ్యాణ్.. అంతేకాదు తన స్నేహితులందరూ ఎప్పుడూ ఆటల్లో రాణిస్తూ ఉండేవారు.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతిసారి ప్రతి ఆటలో కూడా ఫెల్  అవుతూ ఉండేవాడట. అంతేకాదు స్కూల్ కి వెళ్లాలంటే పవన్ కళ్యాణ్ కి అసలు ఇష్టం ఉండేది కాదట..

అంతేకాదు స్కూల్లోని టీచర్లను కూడా అసలు ఇష్టపడేవాడు కాదట పవన్ కళ్యాణ్.. ఏ విషయం నైనా ఎవరు చెప్పకుండానే తన సొంతంగా తానే నేర్చుకునే వాడట..ఈ నేపథ్యంలోనే ఆయనకి 17 సంవత్సరాలు ఉన్న సమయంలో మానసికంగా ఒత్తిడికి గురై ఆత్మహత్య కూడా చేసుకోవాలని ప్రయత్నించాడట పవన్ కళ్యాణ్.. ఈ నేపథ్యంలోనే ఆ ఒత్తిడిని భరించలేక చిరంజీవి గన్ తీసుకొని కాల్చుకోవడానికి కూడా సిద్ధమయ్యాడట పవన్ కళ్యాణ్.. ఇక ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చేతిలో చూసిన సురేఖ మరియు నాగబాబు ఇద్దరు పవన్ కళ్యాణ్ ని తిట్టి ఆ గన్ ని లాక్కున్నారటమ్అనంతరం ఈ విషయాన్ని చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్తే.. పవన్ కళ్యాణ్ ని తిట్టాడట.. నువ్వు ఏ చదువులు చదవకపోయినా మాకు అనవసరం.. కానీ నువ్వు బ్రతికుండ చాలు అంటూ మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కి చెప్పాడట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: