తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి.. బాలీవుడ్ లో సినిమాలు విడుదల చేయకపోయినప్పటికీ అక్కడ ఉన్న ప్రేక్షక ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ సెలబ్రిటీలు కూడా మహేష్ బాబుతో ఒక్క సినిమా చేస్తే చాలు అని ఆరాటపడుతున్న క్షణాలు మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం. దీపికా పదుకొనే లాంటి ఇంటర్నేషనల్ హీరోయిన్స్ కూడా మహేష్ బాబుతో ఒక్క సినిమాలో చేస్తే చాలు అని ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఒక పాన్ ఇండియా మూవీలో కూడా నటించని మహేష్ బాబు ట్రెండ్ సెట్టర్ గా మారడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

అసలు విషయంలోకి వెళ్తే మహేష్ బాబు,  త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఖలేజా సినిమా థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు కానీ బుల్లితెరపై ప్రసారమైన ప్రతిసారి కూడా మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కథ , కథాంశం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.. ఇదిలా వుండగా ప్రస్తుతం తెలుగు సినిమాలలో సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి విడుదలకు ముందే సినిమా నుంచి టీజర్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ ట్రెండును సెట్ చేసింది మాత్రం మహేష్ బాబు అని చెప్పాలి.. మొదటిసారి ఖలేజా నుంచి టీజర్ రిలీజ్ చేశారు.  అలా టీజర్ వచ్చిన తొలి తెలుగు సినిమాగా ఖలేజా రికార్డ్ సృష్టించింది.

మరొకవైపు గ్లింప్స్  వచ్చిన తొలి తెలుగు సినిమాగా స్పైడర్ కూడా మరో రికార్డును సొంతం చేసుకుంది.  దీన్ని బట్టి చూస్తే ఈ రెండు సినిమాలతో ఈ కొత్త  ట్రెండుకు శ్రీకారం చుట్టారు మహేష్ బాబు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ప్రతి సినిమా విడుదలకు ముందే టీజర్ , గ్లింప్స్ అంటూ విడుదల చేస్తూ సినిమాపై బస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.  ఏది ఏమైనా మహేష్ బాబు రేంజ్ రోజుకు పెరిగిపోతుందని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: